రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపిన బెజవాడ గ్యాంగ్ వార్ లో తీవ్రంగా గాయపడిన తోట సందీప్ అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఉదయం జరిగిన గ్యాంగ్ వార్ లో అతనికి బలమైన గాయాలు కావడంతో అతనిని వెంటనే స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించారు. ఆటో నగర్ లో అతనికి చికిత్స అందించారు. అయితే గాయాల తీవ్రత చాలా ఎక్కువగా ఉండటంతో సందీప్ ప్రాణాలు కోల్పోయాడు. 

 

అయితే అతని మృతదేహాన్ని ఇంకా ఆస్పత్రి వర్గాలు అందించలేదు. దీనితో అతని అనుచరులు ఇప్పుడు ఆస్పత్రి వద్ద ఆందోళన చేస్తున్నారు. కాగా ఒక భూ వివాదం విషయంలో ఈ గొడవ జరిగింది. జనావాసాల మధ్యలో ఈ గ్యాంగ్ వార్ జరిగింది. అందరి మీద హత్యాయత్నం కేసులు నమోదు చేసినట్టు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: