ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీ కేవలం దేశానికి మాత్రమే రాజధాని కాదు కరోనాకి కూడా రాజధాని గా మారింది. అవును అక్కడ కరోనా కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఎన్ని చర్యలను తీసుకున్నా సరే ఫలితం మాత్రం ఉండటం లేదు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారి ద్వారా అక్కడ కరోనా కేసులు చాలా వేగంగా పెరుగుతున్నాయి. 

 

ఎన్ని చర్యలు తీసుకున్నా సరే ఆగడం లేదు కరోనా కేసులు. ఢిల్లీ లో నిన్న ఒక్కరోజే 13 మరణాలు మరియు 1295 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి, ఢిల్లీలో మొత్తం కేసుల సంఖ్య 19844 కు చేరుకుంది. మరణాల సంఖ్య 473 కి చేరుకుందిని ఢిల్లీ ప్రభుత్వం ఒక ప్రకటనలో వెల్లడించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: