దేశం మొత్తం కూడా ఇప్పుడు కరోనా పేరు చెప్తే చాలు భయపడే పరిస్థితి నెలకొంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే కరోనా మాత్రం ఆగడం లేదు. ఎవరు తుమ్మినా ఎవరు దగ్గినా సరే ప్రజలు మాత్రం కంగారు పడే వాతావరణం ఉంటుంది దేశంలో. కాని కొంత మంది మాత్రం లెక్కలేని విధంగా వ్యవహరిస్తున్నారు. అవును తాజాగా కర్ణాటక లో ఒక కార్పొరేటర్ పెద్ద సీన్ చేసాడు. 

 

బెంగళూరులోని పాదరాయణపుర వార్డులో కార్పొరేటర్ ఇమ్రాన్ పాషాకు కరోనా రాగా... అతనికి చికిత్స అందించడం కోసం ఆస్పత్రికి తీసుకుని వెళ్ళాలి అని అధికారులు భావించారు. కాని అతను మాత్రం వచ్చేది లేదు అని చెప్పారట. శనివారం మేం ఆయన ఇంటికి వెళ్లినప్పుడు మమ్మల్ని చాలా సేపు వెయిట్ చేయించారని అధికారులు ఆవేదన వ్యక్తం చేసారు. అతని అనుచరులు కూడా ఇబ్బంది పెట్టారట.

మరింత సమాచారం తెలుసుకోండి: