అంతరాష్ట్ర రవాణాకు ఇప్పుడు అనుమతులు ఇచ్చిన నేపధ్యంలో దాదాపు అన్ని రాష్ట్రాల మధ్య రాకపోకలు మొదలయ్యాయి. ఈ నేపధ్యంలో కర్ణాటక, తమిళనాడు, తెలంగాణా, ఓడిశా నుంచి కూడా రవాణా సౌకర్యాలు మొదలయ్యాయి. అయితే ఈ విషయంలో మాత్రం ఏపీ సర్కార్ చాలా అప్రమత్తంగా వ్యవహరిస్తుంది. 

 

స్టేట్ నోడల్ ఆఫీసర్ డాక్టర్. శ్రీకాంత్ మాట్లాడుతూ... సరిహద్దుల్లో కరోనా పరీక్షలు నిర్వహిస్తామని, పరీక్షల కోసం కొంత సమయం పట్టే అవకాశం ఉన్నందున అందరూ సహకరించాలని, పరీక్షల్లో నెగిటివ్ వస్తే 14 రోజుల పాటు హోం క్వారంటైన్‌‌కు, పాజిటివ్ వస్తే ప్రభుత్వ క్వారంటైన్ వెళ్లాలని ఆయన సూచించారు. అలాగే వ్యాధిగ్రస్తులకు కూడా ప్రత్యేక పరీక్షలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా శ్రీకాంత్ పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: