గత కొద్ది రోజులుగా ఏపిలో జరుగుతున్న పరిణామాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు.  అయితే కరోనా తెలుగు రాష్ట్రాల్లో మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డి తీసుకుంటున్న చర్యలపై ప్రతిపక్ష నేతలు చీటికి మాటికి విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో వైసీపీ నేత ఎంపీ విజయసాయి రెడ్డి ఎప్పటిప్పుడు ప్రతిపక్ష నేతలపై తనదైన స్టైల్లో విరుచుకు పడుతున్నారు.  తాజాగా  పోతిరెడ్డిపాడు పనులు నిలిపివేయాలని గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశిస్తే ఒక్క మాట మాట్లాడలేదు.

 

ప్రభుత్వం కంటే ముందే తమ పార్టీ కోర్టుకెళ్తుందని బాబు అని ఉంటే ప్రజల పట్ల అంతో ఇంతో బాధ్యత ఉందని అనిపించేది. పట్టించుకోనవసరం లేని వ్యక్తుల కోసం న్యాయ పోరాటాలు చేసి పరువు తీసుకుంటున్నాడు. ఇప్పటికే  వైసీపీ నేత విజయసాయిరెడ్డి, టీడీపీ నేత బుద్దా వెంకన్న మధ్య ట్విట్టర్ వార్ కొనసాగుతూనే ఉంది. విజయసాయిరెడ్డి చేసే ట్వీట్లకు బుద్దా వెంకన్న తనదైన శైలిలో సమాధానాలు ఇస్తుంటారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: