తెలంగాణాలో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తుంది. నిన్న దాదాపు 200 కేసుల వరకు తెలంగాణాలో నమోదు కావడం ఆందోళన కలిగించే అంశంగా చెప్పుకోవచ్చు. లాక్ డౌన్ ని హైదరాబాద్ లో కఠినం గ అమలు చేస్తున్నా సరే ఫలితం మాత్రం పెద్దగా కనపడటం లేదు అనే చెప్పవచ్చు. ఇక ఇప్పుడు ఒక సంచలన విషయం వెలుగులోకి వచ్చింది.

 

హైదరాబాద్ లో తెలంగాణా బిజెపి కి చెందిన ఒక ముఖ్యనేతకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఇక ఆయన కుటుంబ సభ్యులకు కూడా కరోనా సోకినట్టు అధికారులు వెల్లడించారు. ఆయన ప్రస్తుతం ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నట్టు సమాచారం. ఇక ఆయన ఇటీవల ఏదైనా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారా లేదా అనేది తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: