ఆంధ్రప్రదేశ్ సచివాలయానికి కరోనా ఎఫెక్ట్ తగిలింది. 3, 4 బ్లాకుల్లో పని చేసే ఇద్దరు ఉద్యోగులకు కరోనా సోకింది. దీనితో సచివాలయ సిబ్బంది అలెర్ట్ అయ్యారు. క్వారంటైన్ లో ఉన్న ఇద్దరు ఉద్యోగులతో కూడా మిగతా ఉద్యోగులు సన్నిహితంగా మెలిగినట్టు తెలుస్తుంది. దీనితో 3, 4 బ్లాకుల్లో ఉద్యోగులు ఎవరూ కూడా విధులకు హాజరు కాలేదు. 

 

ఇక మంత్రి మేకపాటి గౌతం రెడ్డి తన కార్యాలయాన్ని విజయవాడ కు తరలించారు. సచివాలయ పరిసర ప్రాంతాల్లో మొత్తం కూడా క్రిమిసంహారక మందులను పిచికారి చేయడం తో పాటుగా బ్లీచింగ్ కూడా చల్లారు. హైదరాబాద్ నుంచి వచ్చిన వారికి కరోనా సోకిందని వార్తలు వస్తున్నాయి. ఈ ఘటనతో ఉద్యోగులు అందరూ భయపడిపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: