మన తెలుగులో ఇప్పుడు బయోపిక్ లకు మంచి హవా కొనసాగుతుంది. సినీ రాజకీయ క్రీడా ప్రముఖుల జీవితాలను తెర మీద చూపించడానికి గానూ దర్శక నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు. ఇక మన తెలుగు వారు గర్వించే వెయిట్ లిఫ్టర్ కరణం మల్లీశ్వరి జీవిత కథ ఆధారంగా సినిమా తీయడానికి సిద్దమయ్యారు. ‘రాజుగాడు’ తో దర్శకురాలి గా మారిన సంజనా రెడ్డి కరణం బయోపిక్ తీయడానికి ముందుకు వచ్చారు. 

 

తన డ్రీం ప్రాజెక్ట్ అని ఆమె చెప్పారు. శ్రీకాకుళంలోని ఓ మారుమూల పల్లె నుంచి సిడ్నీ ఒలింపిక్స్‌లో పతకం వరకు ఆమె ప్రయాణం ఈ సినిమాలో ఉంటుంది. వెయిట్‌ లిఫ్ట్‌ విభాగంలో భారత్‌కు తొలి పతకం అందించారు ఆమె. ప్రముఖ క్రీడా పురస్కారం రాజీవ్‌ ఖేల్‌రత్న, పద్మశ్రీనీ కూడా ఆమె అందుకున్న సంగతి తెలిసిందే. ఇది పాన్ ఇండియా సినిమాగా రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: