తెలుగు చిత్ర పరిశ్రమలో సుశాంత్ కి  ఒక ప్రత్యేకమైన గుర్తింపు. ఒకప్పుడు హీరోగా తన హవా నడిపించిన సుశాంత్ ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాల్లో పలు కీలక పాత్రల్లో నటిస్తూ మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. మొన్నటికి మొన్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన అల  వైకుంఠపురములో  సినిమాలో కీలక పాత్రలో నటించి తన నటనతో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. అయితే మామూలుగా సెలబ్రిటీలకు సంబంధించిన ఏదైనా ఫోటో సోషల్ మీడియాలోకి వచ్చింది అంటే అది క్షణాల్లో వైరల్ అయిపోతూ ఉంటుంది అనే విషయం తెలిసిందే. 

 


 తాజాగా సుశాంత్ పెట్టిన ఒక పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. కీబోర్డు వాయిస్తూ  ఉన్న ఒక ఫోటో ని సుశాంత్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. నేను దీన్ని కొత్తగా భావించాను... ఇది ఒక అనుభవం గా లెక్కలోకి వస్తుందా.. అంటూ సుశాంత్  ఒక పోస్టు పెట్టారు. కాగా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: