ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త అయినా ప్రశాంత్ కిషోర్  ఎప్పుడు సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందేm తాజాగా కరోనా  వైరస్ కు సంబంధించి మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ప్రశాంత్ కిషోర్. ప్రస్తుతం కరోనా  వైరస్ వ్యాప్తి ఎక్కువ అవుతున్నప్పటికీ దశలవారీగా కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ ఉపసంహరించుకున్న నేపథ్యంలో... రాబోయే రోజుల్లో కరోనా  వైరస్ పరిస్థితిపై వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

 


 లాక్‌డౌన్‌ అమలు నుంచి అన్లాక్ మొదటి దశ వరకు.. అంటే మార్చి 20 నుంచి మే 31 వరకు కరోనా  వైరస్ వ్యాప్తి ఎలా ఉంది.. ఆ తర్వాత ఎంతలా పెరిగిపోయింది  అనేది గణాంకాలతో సహా ఒక ట్వీట్ చేశారు.లాక్‌డౌన్‌ అమలుకు ముందు మొదటి విడత లాక్ డౌన్  ఉపసంహరణ తర్వాత కరోనా  వైరస్ గణాంకాల లెక్క ఇది గుర్తుంచుకోండి అంటూ ఈ ఒక  ప్రశాంత్ కిషోర్  ట్విట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ప్రస్తుతం అది కాస్తా వైరల్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: