కేంద్ర కేబినేట్ సమావేశం ముగిసింది. 3 గంటలకు కేంద్ర మంత్రులు మీడియా ముందుకు రానున్నారు. నితిన్ గడ్కారి, తోమార్, అలాగే మరో మంత్రి ప్రకాష్ జవదేకర్ మీడియా ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీరి నుంచి కీలక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. వన్ నేషన్ వన్ మార్కెట్ పై వీరి నుంచి ప్రకటన వచ్చే సూచనలు ఉన్నాయి. 

 

కేబినేట్ సమావేశంలో ప్రధానంగా చర్చించిన ఆత్మ నిర్భర భారత్ గురించి కూడా చర్చించే సూచనలు కనపడుతున్నాయి. వీటిపై వీరి నుంచి కీలక ప్రకటన వస్తుందని అంటున్నారు. అదే విధంగా చైనా సరిహద్దు వివాదం గురించి కేబినేట్ లో చర్చించారు. మూడు గంటలకు కేంద్ర మంత్రుల భేటి పై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: