ఆంధ్రప్రదేశ్ లో కోయంబేడు మార్కెట్ లింకులకు సంబంధించిన కేసులు రోజు రోజుకి బయటపడుతూనే ఉన్నాయి. రోజు పదుల సంఖ్యలో కోయంబేడు లింకులు బయటపడుతున్నాయి. దీనితో ఇప్పుడు ఏపీ సర్కార్ అప్రమత్తమవుతుంది. చెన్నై నుంచి వచ్చే వారు అందరిని కూడా ఆపెయ్యాలని సరిహద్దులను మూసి వెయ్యాలని భావిస్తున్నారు. 

 

అంతరాష్ట్ర సరిహద్దుల విషయంలో ఏ మాత్రం అలసత్వం ఉన్నా సరే ఇప్పుడు అనవసరంగా కేసులు పెరిగే అవకాశం ఉందని దయచేసి చెన్నై నుంచి వచ్చే విమానాలను ఆపేస్తే మంచిది అనే ఆలోచనలో సిఎం జగన్ ఉన్నారు. అదే విధంగా తమిళనాడు సరిహద్దుని కూడా మూసి వేస్తే మంచిది అనే ఆలోచనలో జగన్ ఉన్నారని పరిశీలకులు అంటున్నారు. దీనిపై కేబినేట్ సమావేశంలో నిర్ణయం తీసుకునే సూచనలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: