ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేపు ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు అని ఆయన కేంద్ర జల శక్తి మంత్రిని, అలాగే హోం మంత్రి అమిత్ షా ని కలుస్తారని అన్నారు. వీలు అయితే మరి కొందరు కేంద్ర మంత్రులతో కలుస్తారని చెప్పారు ఢిల్లీ నుంచి రాష్ట్రానికి చాలా నిధులు రావాల్సి ఉందని అన్నారు. అధికార పార్టీ నేతలను టీడీపీ నేతలు ఫ్యాక్షనిస్ట్ లు గుండాలు అని అన్నారని మండిపడ్డారు. 

 

నిమ్మగడ్డ రమేష్ వ్యవహారంలో చంద్రబాబు కుట్రపూరితంగా వ్యవహరించారని సాయి రెడ్డి మండిపడ్డారు. నిమ్మగడ్డ వ్యవహారం అనేది ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు అని విజయసాయి రెడ్డి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. నోటీసులు అందిన మా పార్టీ కార్యకర్తలకు తాను అండగా ఉంటాను అని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: