మాజీ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలో తాము సుప్రీం కోర్ట్ కి వెళ్తున్నామని ప్రకటించారు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి. రమేష్ కుమార్ కి వ్యవస్థల మీద ఏ మాత్రం గౌరవం లేదని ఆయన మండిపడ్డారు. నిమ్మగడ్డ రమేష్ బాధ్యతగల పదవిలో ఉండి ప్రభుత్వం మీద బురద జల్లారని అన్నారు. 

 

చంద్రబాబు వ్యవస్థలను భ్రష్టు పట్టిస్తున్నారని చంద్రబాబు అడగుఅడుగునా కుట్రలు చేస్తున్నారని, నిమ్మగడ్డ రమేష్ తనను తాను నియమించుకున్నారని ఏ ఉత్తర్వులు అయినా ప్రభుత్వం నుంచే రావాలి అన్నారు. కాని ఇక్కడ అలా జరగలేదని అన్నారు. తాము ఏ విధమైన అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడలేదని అన్నారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలో టీడీపీ హైకోర్ట్ కి ఎందుకు వెళ్ళింది అని ఆయన ప్రశ్నించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: