రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని శ్రీరామ్ నాగర్‌లో దారుణం జరిగింది... పైసల కోసం సొంత నాన్నమ్మనే హతమార్చాడో కసాయి మనవడు.. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. డబ్బు కోసం క్షణికావేశాని గురి అవుతూ.. నా పరాయ అనే తేడా లేకుండా మనుషుల ప్రాణాలు సైతం తీస్తున్నారు కొంత మంది దుర్మార్గులు.  తాజాగా తనకు డబ్బు ఇవ్వలేదని పట్టుమని పదహేరేళ్లు కూడా లేని మైనర్ తన నాయనమ్మను చంపినట్లు వార్తలు వస్తున్నాయి.  గత కొన్ని రోజులుగా లింగం అనే బాలుడు... ఊళ్లో జులాయిగా తిరుగుతూ.. డబ్బుల కోసం అప్పుడప్పుడు నాన్నమ్మను అడిగేవాడు.. అయితే.. డబ్బులు ఇవ్వలేదన్న కోపంతో లింగమే.. వాళ్ల నాన్నమ్మను హత్య చేసినట్టు భావిస్తున్నారు పోలీసులు. 

 

అక్కడే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడా..? ఇంకెవరైనా సహాయం చేశారా? అనే కోణంలో ఆరా తీస్తున్నారు.. అయితే, గతంలో కూడా ఇంట్లో డబ్బులు తీసుకొని జులాయిగా తిరిగి.. డబ్బులు అయిపోయాక ఇంటికి తిరిగి వచ్చిన సందర్భాలు ఉన్నాయని చెబుతున్నారు. అయితే కుటుంబ సభ్యులు సమీప బంధువు ఇంటికి వెళ్లడంతో ఒంటరిగా ఉన్న నాయనమ్మను డబ్బులు అడగం.. ఆమె కాదనడంతో   నిన్న రాత్రి హత్యచేసి ఉండవచ్చు అంటున్నారు స్థానికులు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. 

మరింత సమాచారం తెలుసుకోండి: