ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విధ్వంసం కొనసాగుతోంది. లక్షల సంఖ్యలో ప్రజల ప్రాణాలను హరిస్తోంది. ఇదే సమయంలో కరోనాను జయిస్తున్న వారి సంఖ్య కూడా ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతోంది. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. కరోనా మహమ్మారిని పసిపిల్లల నుంచి పండుముసలి వరకూ ఓడించిన ఘటనలు అక్కడక్కడ వెలుగుచూస్తున్నాయి. గతంలో ఇటలీలో 104 వృద్ధురాలు వైరస్ను ఓడించి వైద్యవర్గాల్లో, ప్రజల్లో ఆత్మస్థైర్యం నింపిన విషయం తెలిసిందే.
తాజాగా.. ఇండోనేషియాకు చెందిన వందేళ్ల వృద్ధరాలు కరోనా వైరస్ బారి నుంచి కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యింది. కాగా, ఇండోనేషియాలో ఇప్పటివరకు 26,940 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 1641మరణాలు సంభవించాయి.