భార‌త‌దేశ వ్యాప్తంగా నమోదు అవుతున్న కొవిడ్-19 కేసుల్లో మూడో వంతు కేసులు ఒక్క మహారాష్ట్రలోనే ఉన్నాయి. అందులోనూ వాణిజ్య రాజధాని ముంబై సహా అనేక ప్రాంతాల్లో క‌రోనా మ‌హ‌మ్మారి విల‌య‌తాండ‌వం చేస్తోంది. నిన్న ఒక్క‌రోజే 2,361 కేసులతో మహారాష్ట్రలో కేసుల సంఖ్య 70 వేలకు దాటింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసులు 70,013లకు చేరాయని సోమవారం సాయంత్రం ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇక తాజాగా 76 మరణాలతో రాష్ట్రంలో మరణాల సంఖ్య 2,362కు చేరింది. మరణాల్లో సైతం మహారాష్ట్ర దేశంలోనే ప్రథమ స్థానంలో ఉండ‌డం గ‌మ‌నార్హం. ప్రస్తుతం 37,543 యాక్టివ్ కేసులు ఉన్నాయి. బాధితుల్లో 30,108 మంది కోలుకున్నారు.

 

సోమవారం ఒక్కరోజే 779 మంది ఆసుపత్రుల నుంచి డిశ్చార్జీ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 4,71,473 టెస్టులు నిర్వహించినట్లు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ఇక ముంబైలో కేసుల సంఖ్య 41,099కి చేరింది. మహారాష్ట్రలో నమోదైన కేసుల్లో 60 శాతం కేసులు ఒక్క ముంబైలోనే ఉన్నాయి. సోమవారం ఒక్కరోజే నగరంలో 1,413 కేసులు నమోదు అయ్యాయి. ప్రస్తుతం ముంబైలో 22,789 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో ప్ర‌జ‌లు తీవ్ర భ‌యాందోళ‌న‌కు గుర‌వుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: