దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. నాలుగు రోజుల నుంచి ప్రతీ రోజు కూడా  7 వేల కేసులకు పైగా నమోదు అవుతున్నాయి. ఎన్ని చర్యలు తీసుకున్నా లాక్ డౌన్ ని కఠినం గా అమలు చేస్తున్నా సరే పెద్దగా ఫలితం మాత్రం ఉండటం లేదు అనే చెప్పాలి. ఇక దేశ వ్యాప్తంగా గత 24 గంటల్లో మరోసారి దాదాపు 8 వేల కేసులు నమోదు అయ్యాయి.

 

7,761 కొత్త కేసులు నమోదు కావడం తో పాటుగా 200 మంది కరోనా వైరస్ తో ప్రాణాలు కోల్పోయారు. 198,370 మంది ఇప్పటి వరకు కరోనా బారిన పడ్డారు. రేపటి తో రెండు లక్షల కేసులు దాటే సూచనలే కనపడుతున్నాయి. ఇక ఇప్పటి వరకు కరోనాతో 5,608 మంది మరణించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: