నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం గొట్లపాలెంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మద్యం మత్తులో భర్త భార్యను కొట్టి ఆమెను సజీవంగా పూడ్చి పెట్టాడు. రెండు రోజుల క్రితం ఈ ఘటన జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పూర్తివివరాలలోకి వెళితే గొట్లపాలేనికి చెందిన సుభాషిణి, సాములు రెండు రోజుల క్రితం మద్యం తాగి గొడవ పడ్డారు. సాములు మద్యం మత్తులో బలమైన కర్రతో సుభాషిణిని కర్రతో కొట్టాడు. 
 
సుభాషిణి స్పృహ కోల్పోవడంతో సాములు ఆమెను సజీవంగా పూడ్చి వేశాడు. ఈ విషయం ఎవరికీ చెప్పవద్దని కుమార్తెను బెదిరించాడు. ఏడు సంవత్సరాల పాప గ్రామస్థులకు ఈ విషయం చెప్పడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం సాములు పరారీలో ఉన్నాడు. కొడవలూరు పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: