ప్ర‌పంచ మ‌హ‌మ్మారి క‌రోనా దెబ్బ‌తో ప్ర‌పంచంలోని కోట్లాది మంది ప్ర‌జలు ఎలా విల‌విల్లాడుతున్నారో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. క‌రోనా దెబ్బ‌తో సెలబ్రిటీలు, సామాన్యులు అంద‌రూ త‌ట్టుకోలేక‌పోతున్నారు. క‌రోనా ఎంత‌టి వారిని అయినా వ‌ద‌ల‌డం లేదు. ఇప్ప‌టికే బ్రిట‌న్ ప్ర‌ధాన‌మంత్రికి క‌రోనా సోక‌గా ఆయ‌న చాలా రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండి త‌గ్గించుకున్నారు. ఇక ఇప్పుడు క‌రోనా మ‌రో దేశ ప్ర‌ధాన‌మంత్రికి సైతం సోకింది. తాజాగా ఆర్మేనియా ప్ర‌ధాన‌మంత్రికి ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు క‌రోనా సోకింది. ఈ క్ర‌మంలోనే మ‌న ప్ర‌ధాన‌మంత్రి మోదీ ఆయ‌న్ను పరామ‌ర్శించారు. 

 

కరోనా మహమ్మారిపై జరుగుతున్న పోరాటంలో భారత్.. అర్మేనియాకు అండగా  నిలుస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ప్రధాని నికోల్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులు త్వరగా కరోనా నుంచి కోలుకోవాలని మోదీ ఆకాంక్షించారు. ఇక 30 ల‌క్ష‌ల జ‌నాభా ఉన్న ఆర్మేనియాలో ఇప్ప‌టికే 9 వేల క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: