ప్రముఖ సినీ గేయ రచయిత, కవి జొన్నవిత్తుల రామ లింగేశ్వర రావుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసారు పోలీసులు. ఆయన అంటరానితనాన్ని పునరుద్ధరణ చేసే విధంగా బ్రహ్మణ సమాజాన్ని పురమాయించేలా పద్యం రాశారని తెలంగాణ మాల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బత్తుల రాంప్రసాద్‌ ఆగ్రహం వ్యక్తం చేసారు. 

 

దీనిపై ఆయన వెంటనే నాంపల్లి పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. దీనితో కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు. ఆయన వెంటనే దళిత సమాజానికి క్షమాపణలు చెప్పాలి అని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి పద్యాలు భవిష్యత్తులో రాస్తే కఠిన చర్యలు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలి అని ఆయన పోలీసులకు విజ్ఞప్తి చేసారు. ఇప్పటికే జొన్నవిత్తులకు పోలీసులు సమాచారం ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: