తెలంగాణా ఇచ్చిన కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేస్తున్నారని... తెలంగాణా వచ్చిన ఆరేళ్ళు అయినా సరే ఇంకా ప్రాజెక్ట్ లు పెండింగ్ లో ఉన్నాయని, తెలంగాణా సర్కార్ నియంత్రిత ధోరణి పై తెలంగాణా సమాజం ఆలోచించాలి అని మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ అన్నారు. తెలంగాణా ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేసారు. 

 

తెలంగాణాలో కాంగ్రెస్ నేతలు జలదీక్షకు పిలుపు ఇవ్వగా ఎక్కడిక్కడ పోలీసులు వారిని అదుపులోకి తీసుకుంటున్నారు. హౌస్ అరెస్ట్ లు చేయడమే కాకుండా వారిని బయటకు రానీయకుండా పోలీసులు మొహరించారు. దీనిపై ఇప్పుడు పెద్ద దుమారం రేగుతుంది. ఇక పలు చోట్ల కాంగ్రెస్ ఆఫీసుల్లో కాంగ్రెస్ నేతలు జాతీయ జెండాలను ఆవిష్కరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: