తెలంగాణాలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి కరోనా కట్టడికి ఎన్ని చర్యలు తీసుకున్నా సరే కేసులు మాత్రం ఆగే పరిస్థితి దాదాపుగా కనపడటం లేదు. ఇక తాజాగా హైదరాబాద్ లోని ఉస్మానియా హాస్పిటల్ లో జూనియర్ వైద్యులకు కరోనా సోకింది. దీనితో అధికారులు అప్రమత్తమయ్యారు. 

 

అక్కడ ఉన్న మొత్తం పీజీ స్టూడెంట్స్ అందరికీ కరోనా టెస్టులు చేయిస్తున్నారు అధికారులు. కరోనా వచ్చినా వారి ఆరోగ్యానికి ఏ ఇబ్బంది లేదని అధికారులు చెప్తున్నారు. మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ శశికళ మీడియాతో మాట్లాడుతూ... వైరస్ విస్తరించకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామన్న ఆమె ఇద్దరు అమ్మాయిలు, ఐదుగురు అబ్బాయిలకు కరోనా సోకిందన్నారు. వారిని గాంధీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: