తెలంగాణాలో ఇప్పుడు సాగునీటి విషయంలో కేసీఆర్ సర్కార్ ఏ విధంగా దూకుడు చూపిస్తుంది అనే విషయం అందరికి తెలిసిందే. ఇక ఇటీవల కొండ పోచమ్మ సాగర్ ప్రారంభం సందర్భంగా కేసీఆర్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేసారు. తాను వారం రోజుల్లో ఒక గుడ్ న్యూస్ తెలంగాణా ప్రజలకు చెప్తాను అని అన్నారు. ఇక అక్కడి నుంచి ఆయన చెప్పేది ఎమై ఉంటుంది అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. 

 

అయితే కేసీఆర్ చెప్పే గుడ్ న్యూస్ గురించి ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతుంది. ఆయన రైతులకు నియంత్రిత పంటలు వేసే వారికి రైతు బంధుని భారీగా పెంచే ఆలోచనలో కేసీఆర్ ఉన్నారట. అదే విధంగా రైతులు అందరికి పెన్షన్ స్కీం ని ఆయన అమలు చేస్తారని దాని మీద ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: