టీడీపీ మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డికి ఏపీ రవాణా శాఖ అధికారులు భారీ షాక్ ఇచ్చారు. దివాకర్ రెడ్డి ట్రావెల్స్కు సంబంధించిన వాహనాలను అధికారులు సీజ్ చేశారు. బీస్-3 వాహనాలను.. బీఎస్-4 వాహనాలుగా మార్చి నడుపుతున్నట్లు గుర్తించిన అధికారులు వాటిని సీజ్ చేశారు. నాగాలాండ్తో పాటు పలు రాష్ట్రాల్లో వాహనాలను అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేసినట్టు అధికారులు తేల్చారు. గతంలో 57 వెహికల్స్ని అధికారులు సీజ్ చేయగా తాజాగా 4 టిప్పర్లు సీజ్ అయ్యాయి.
మొత్తం 154 వాహనాలను అక్రమంగా రిజిస్టేషన్ చేశారని అధికారులు చెబుతున్నారు. డీటీసీ శివరామ ప్రసాద్ త్వరలో అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసిన మిగతా వాహనాలను కూడా సీజ్ చేస్తామని తెలిపారు. టీడీపీ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి వాహనాలను సీజ్ చేయడంపై ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.