తెలంగాణా అవతరణ దినోత్సవం సందర్భంగా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ట్విట్టర్ వేదికగా తెలంగాణా ప్రజలకు శుభాకాంక్షలు చెప్పారు. “తెలంగాణ ప్రజలందరికీ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. ఘనమైన చరిత్ర, సహజవనరులతోపాటు భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రతిబింబిస్తున్న తెలంగాణ.. వివిధ రంగాల్లో గణనీయమైన ప్రగతితో దేశాభివృద్ధిలో తనవంతు పాత్రను కొనసాగిస్తూ.. మరింత సమృద్ధిని సాధించాలని ఆకాంక్షిస్తున్నాను అని ఆయన పేర్కొన్నారు.
దీనికి తెలంగాణా సిఎంఓ రిప్లై ఇచ్చింది. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపినందుకు ధన్యవాదాలు. తెలంగాణ రాష్ట్ర ప్రగతిని ఆకాంక్షించినందుకు రాష్ట్ర ప్రజల తరుఫున, వ్యక్తిగతంగా నా తరుఫున హృదయపూర్వక కృతజ్ఞతలు అని సీఎం శ్రీ కేసీఆర్ చెప్పినట్టు తెలంగాణా ముఖ్యమంత్రి కార్యాలయ౦ రిప్లై ఇచ్చింది.
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపినందుకు ధన్యవాదాలు. తెలంగాణ రాష్ట్ర ప్రగతిని ఆకాంక్షించినందుకు రాష్ట్ర ప్రజల తరుఫున, వ్యక్తిగతంగా నా తరుఫున హృదయపూర్వక కృతజ్ఞతలు: సీఎం శ్రీ కేసీఆర్ https://t.co/0vUVLGS0oj
— telangana CMO (@TelanganaCMO) June 2, 2020