తెలంగాణా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇప్పుడు సినీ రాజకీయ ప్రముఖులు ట్విట్టర్ వేదికగా సహా పలు సోషల్ మీడియా వేదికల్లో ప్రజలకు శుభాకాంక్షలు చెప్తున్నారు. సినీ రాజకీయ ప్రముఖులు అందరూ కూడా ముందు సిఎం కేసీఆర్ కి శుభాకాంక్షలు చెప్తున్నారు. ఇక రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ తో పాటుగా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కేంద్ర మంత్రులు, ప్రధాని నరేంద్ర మోడీ ట్విట్టర్ లో విష్ చేసారు. 

 

తాజాగా ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్ చేసారు. తెలంగాణ ప్రజలకు రాష్ట్రావతరణ దినోత్సవ శుభాకాంక్షలని ఆయన ట్వీట్ చేసారు. “ఈ రాష్ట్ర ప్రజలు ఎన్నో క్షేత్రాలో తమ ప్రతిభను చాటుతున్నారు. దేశ ప్రగతిలో ఈ రాష్ట్రం ఓ ముఖ్య భూమిక పోషిస్తోంది. తెలంగాణ ప్రజల అభ్యున్నతి మరియు శ్రేయస్సుకై నేను ప్రార్ధిస్తున్నానని వ్యాఖ్యానించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: