దేశంలో అధికారంలో ఉన్న బీజేపీకి వ‌రుస పెట్టి షాకుల మీద షాకులు త‌గులుతున్నాయి. కేంద్రంలో వ‌రుస‌గా రెండోసారి అధికారంలోకి వ‌చ్చినా కూడా అనేక రాష్ట్రాల్లో బీజేపీ ఓడిపోతూ వ‌స్తోంది. ఇప్ప‌టికే బీజేపీ కంచుకోట ల్లాంటి రాష్ట్రాల్లో కూడా ఇత‌ర పార్టీలు పాగా వేసుకుని కూర్చుని ఉన్నాయి. కొన్ని చోట్ల పార్టీ ఫిరాయింపుల ద్వారా అధికారంలోకి వ‌స్తోంది. ఇదిలా ఉంటే పార్టీకి కీల‌క‌మైన దేశ రాజ‌ధాని న్యూ ఢిల్లీలో బీజేపీ వ‌రుస‌గా రెండోసారి కూడా ఓడిపోయింది. అర‌వింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ అక్క‌డ వ‌రుస‌గా రెండోసారి కూడా అధికారంలోకి వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే.

 

ఈ క్ర‌మంలోనే ఈ ఓట‌మిపై బీజేపీ పోస్టుమార్టం చేసింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఢిల్లీ బీజేపీ అధ్య‌క్షుడిగా ఉన్న మాజీ సినిమా హీరో మ‌నోజ్ తివారీని త‌ప్పించేసింది. ఆయ‌న స్థానంలో ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడిగా కుమార్ గుప్తా నియామకం జ‌రిగింది. బోజ్‌పురీ భాష‌లో స్టార్ హీరోగా ఉన్న మ‌నోజ్ తివారీ గ‌త ఎన్నిక‌ల్లో ఢిల్లీ నుంచి లోక్‌స‌భ‌కు ఎంపిక‌య్యారు. ఆయ‌న మాజీ ముఖ్య‌మంత్రి, కాంగ్రెస్ దిగ్గ‌జ నాయ‌కురాలు షీలా దీక్షిత్‌ను భారీ మెజార్టీతో ఓడించారు. అయితే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పార్టీ ఘోరంగా ఓడిపోవ‌డంతో ఆయ‌న‌కు బ‌దులుగా కుమార్ సేన్ గుప్తాను నియ‌మించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: