లాక్ డౌన్ తో చాలా మంది ఇప్పుడు  వరుసగా ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే. తినడానికి తిండి లేక ఎందరో రోడ్డున పడుతున్నారు. ఆకలి వేసినా సరే పెట్టే వారు ఎవరూ లేరు. దీనితో చాలా మంది ఆత్మహత్యల దిశగా అడుగులు వేయడం ఆందోళన కలిగిస్తుంది. దీనితో దేశ వ్యాప్తంగా ఆత్మహత్యలు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. తాజాగా గుంటూరు లో దారుణ౦ జరిగింది. ఫాస్ట్ ఫుడ్ బిజినెస్ తో జీవనం సాగించే షేక్ జాన్... ఆత్మహత్య చేసుకున్నాడు. 

 

తనకు డబ్బులు లేవని ఇంటి అద్దె ఇప్పుడు కట్టలేను అని కుటుంబ పోషణ భారంగా మారింది అని చెప్పినా సరే ఇంటి యజమాని వినలేదు. దీనితో అతను ఉరి వేసుకుని ఆత్మహత్య  చేసుకున్నాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: