దేశ వ్యాప్తంగా భవిష్యత్తు విషయంలో ఎక్కువగా ఆందోళన చెందే వారిలో విద్యార్ధులు ఎక్కువగా ఉన్న సంగతి తెలిసిందే. చాలా మందికి ఇప్పుడు పరిస్థితి ఏంటీ అనేది అర్ధం కావడం లేదు. రోజు రోజుకి కూడా చాలా మంది విద్యార్ధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆన్లైన్ క్లాసులు కొందరికి అందుబాటులో ఉంటే మరికొందరికి అందుబాటులో ఉండటం లేదు. దీనిపై సర్వత్రా ఆందోళన ఉంది. 

 

దీనితో కేరళలో ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. మాలాపురంలో 9 వ తరగతి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. ఆమె ఆన్‌లైన్ తరగతులకు హాజరు కాలేకపోయిందని, తరగతుల నిర్వహణ గురించి ఆందోళన చెందుతు౦ది అని పోలీసులు పేర్కొన్నారు. మల్లాపురం ఎస్పీ మాట్లాడుతూ "కుటుంబం ఆర్థికంగా చితికిపోయిందని కేసుని దర్యాప్తు చేస్తున్నామని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: