ఆంధ్రప్రదేశ్ లో తీవ్ర దుమారం రేపిన డాక్టర్ సుధాకర్ వ్యవహారంలో సిబిఐ అధికారులు దూకుడు పెంచారు. ప్రతీ ఒక్కటి కూడా విచారణ లో అధికారులు ఆరా తీస్తున్నారు. ఇక ఇప్పటికే సుధాకర్ వాంగ్మూలం కూడా తీసుకున్నారు అధికారులు. డాక్టర్ సుధాకర్ పై ఎఫ్.ఐ.ర్ తాజాగా సిబిఐ నమోదు చేసింది. 

 

ఓ ప్రభుత్వ ఉద్యోగి అయి రోడ్డు మీద ప్రజాప్రతినిధుల్ని దూషించడం, విధిలో ఉన్న పోలీసులపై మాట తూలడం, ఓ కానిస్టేబుల్ మొబైల్ ను కిందపడేయడం, న్యూసెన్స్ క్రియేట్ చేస్తూ స్థానికులను భయబ్రాంతులకు గురిచేసారని సిబిఐ ఆరోపణలు చేసింది. ఇక దీనిపై 8 వారాల్లో నివేదిక ఇవ్వాలని సిబిఐ అధికారులను కోర్ట్ ఆదేశించిన సంగతి తెలిసిందే. దీనితో ఇప్పుడు అధికారులు వేగంగా విచారణ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: