ఈ మధ్య కాలంలో వీధి కుక్కల దాడులు ఎక్కువైన సంగతి తెలిసిందే. వీధి కుక్కలను ఏ విధంగా కట్టడి చేసినా సరే అవి చిన్న పిల్లల మీద వృద్దుల మీద ఎక్కువగా దాడి చేస్తున్నాయి. హైదరాబాద్ లో ఇటీవల ఒక బాలిక కుక్కల దాడిలో ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. తాజాగా మరో ఘటన చోటు చేసుకుంది. 

 

కర్నూలు జిల్లా ఆళ్ళ గడ్డలో కుక్కల దాడిలో ఒక బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. దీనిపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనలో మరొకరికి కూడా గాయాలు అయినట్టు సమాచారం. దీనిపై కర్నూలు కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేసారు. కుక్కల గురించి అక్కడి స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: