ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన ఈ నెల 11వ తేదీన కేబినేట్ సమావేశం జరగనుంది. ఉదయం 11 గంటలకు సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం అవుతుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని బుధవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.
కేబినేట్ సమావేశంలో చర్చించే అంశాలపై నివేదికలు పంపాలని అన్ని శాఖల అధికారులను సీఎస్ ఈ సందర్భంగా ఆదేశించారు. కాగా లాక్ డౌన్ మినహాయింపులు వలస కార్మికుల సమస్యలు అదే విధంగా ఎన్నికల కమీషనర్ వ్యవహారంలో ఏ విధంగా ముందుకి వెళ్ళాలి అనే దానిపై ఈ భేటీలో మంత్రి వర్గం చర్చించే అవకాశం ఉంది. అలాగే ఇళ్ళ పట్టాలపై కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది.