వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మరోసారి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తీరుపై తీవ్ర వ్యాఖ్యలు చేసారు. ట్విట్టర్ వేదికగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేసారు. విద్యావ్యవస్థ చంద్రబాబు విధానాలను విజయసాయి తన ట్వీట్ లో తప్పుబట్టారు. ప్రభుత్వ విద్యా వ్యవస్థను నాశనం చేసి, ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించిన బాబు, ఓడిన తర్వాత కూడా వాళ్లకే వంత పాడుతున్నాడని విజయసాయి ఆరోపణలు చేసారు. 

 

అదే విధంగా ఆయన మరికొన్ని సంచలన వ్యాఖ్యలు చేసారు. కమిషన్లు తీసుకుని ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీలు ఫీజులు అడ్డగోలుగా పెంచుకునేందుకు అనుమతించాడని విజయసాయి రెడ్డి మండిపడ్డారు. సీఎం జగన్ గారు ఫీజులు తగ్గిస్తే వ్యవస్థల ద్వారా అడ్డుకుంటున్నాడని ఈ సందర్భంగా విజయసాయి ఆరోపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: