డబ్బు ఎవరికి చేదు.. అన్న చందంగా ఓ బాధ్యతగల నాయకుడు.. మాజీ ఎమ్మెల్యే తనయుడు అయి ఉండి కర్ణాటక నుంచి అక్రమంగా ఆంధ్రప్రదేశ్ లోకి భారీ ఎత్తున మద్యం తరలిస్తూ, పోలీసులకు పట్టుబడ్డాడు. వివరాల్లోకి వెళితే.. రాయదుర్గం తెలుగుదేశం మాజీ ఎమ్మెల్యే బండి హులికుంటప్ప కుమారుడు విక్రమ్ కుమార్ అలియాస్ విక్కీ కర్ణాటక నుంచి అక్రమంగా ఆంధ్రప్రదేశ్ లోకి భారీ ఎత్తున మద్యం తరలిస్తూ, పోలీసులకు పట్టుబడ్డాడు. అయితే ఈ తతంగం మూడు రోజుల క్రితమే జరిగింది.. కానీ ఆలస్యంగా వెలుగులోకి రావడం గమనార్హం.

 

గత నెల 30న 'కేఏ 34 ఏ 5856' నంబర్ గల టాటా ఏస్ వాహనంలో 624 కర్ణాటక మద్యం బాటిళ్లతో విక్రమ్ వస్తుండగా,   రాయదుర్గంలోని మొలకాల్మూరు రోడ్డులో గల ఎక్సైజ్‌ చెక్‌పోస్టులో అసిస్టెంట్‌ ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ ధనుంజయ పట్టుకున్నారు.   అయితే విక్రమ్ తో పాటు ఆ బండి యజమాని మహమ్మద్ అన్సర్, ఆసిఫ్, విశాల్ రాజ్ మహార్ లను కూడా అరెస్ట్ చేశామని పోలీసులు వెల్లడించారు. కాగా, నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టిన పోలీసులు, వీరు తరచూ అక్రమంగా మద్యాన్ని తరలిస్తున్నారని తమ విచారణలో వెల్లడైనట్టు పోలీసులు తెలిపారు.    

మరింత సమాచారం తెలుసుకోండి: