ఈరోజు సుప్రీంకోర్టులో ఏపీ సర్కార్ కు మరో ఎదురుదెబ్బ తగిలిన సంగతి తెలిసిందే. ఏపీలో గ్రామ సచివాలయాలకు, పంచాయతీ కార్యాలయాలకు వేసిన రంగులను నాలుగు వారాల్లోగా తొలగించాలని సుప్రీం ఆదేశించింది. కోర్టు తీర్పు అనంతరం టీడీపీ నేత బోండా ఉమ మీడియాతో మాట్లాడుతూ జగన్ సర్కార్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. బోండా ఉమ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వానికి కోర్టులంటే గౌరవం లేదని అన్నారు. 
 
రాష్ట్రంలో 151 స్థానాలలో గెలిచిందని వైసీపీ ప్రభుత్వం ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తోందని వ్యాఖ్యలు చేశారు. సుప్రీం కోర్టు పంచాయతీ కార్యాలయాలకు రంగుల విషయంలో ఇచ్చిన తీర్పుతో వైసీపీ ప్రభుత్వం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలని చెప్పారు. సీఎం జగన్ మోనార్క్ లా ప్రవర్తిస్తున్నారని అన్నారు. హైకోర్టు చీవాట్లు పెట్టి పిటిషన్ ను కొట్టేసిందని... అయినా జగన్ సర్కార్ సుప్రీంను ఆశ్రయించిందని అన్నారు. 
 
కావాలంటే ఎమ్మెల్యేల ఇళ్లకు వైసీపీ రంగులు వేసుకోవాలని అన్నారు. సుప్రీం స్పష్టంగా తీర్పు చెప్పిందని ఇప్పటికైనా మారాలని అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: