తూర్పుగోదావరి జిల్లా శంఖవరం మండలం నెల్లిపూడిలో ఉపాధి హామీ కూలీలపై పిడుగు పడింది. గ్రామంలో ఈరోజు ఉదయం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురవగా అదే సమయంలో ఉపాధి హామీ పథకం కూలీలు చెరువు మరమ్మత్తు పనులు చేస్తున్నారు. దాదాపు 200 మంది కూలీలు పనులు చేస్తున్న చేస్తున్న సమయంలో పిడుగు పడింది. వారిలో 18 మందికి తీవ్ర గాయాలు కావడంతో మిగతా కూలీలు వారిని ఆస్పత్రికి తరలించారు. 
 
ప్రస్తుతం ప్రత్తిపాడు ఏరియా ఆస్పత్రిలో గాయాలపాలైన వారికి చికిత్స జరుగుతోంది. గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి తీవ్ర విషమంగా ఉందని తెలుస్తోంది. ఊరికి సమీపంలో పిడుగు పడటంతో నెల్లిపూడి గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారు. ఒక్కసారిగా పిడుగు పడటంతో కూలీలు సైతం షాక్ కు గురయ్యారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: