మాన్సాస్ ట్రస్ట్ అన్నది ఒక ఉన్నతమైన లక్ష్యాలతో పూసపాటి వంశీయులు స్థాపించిన సంస్థ అని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అన్నారు. ఆ సంస్థ కింద 105 దేవాలయాలతో పాటు, ఎన్నో విద్యాలయాలు ఉన్నాయన్నారు. సంస్థకున్న పవిత్ర ఆశయాలను దృష్టిలో పెట్టుకుని తెలుగుదేశంతో సహా ఏ పార్టీ అధికారంలో ఉన్నా సంస్థ విషయాల్లో జోక్యం చేసుకోలేదని ఆయన కాసేపటి క్రితం ట్వీట్ చేసారు. 

 

అలాంటిది రూ.1 లక్షా 30 వేల కోట్లకు పైగా విలువజేసే ట్రస్ట్ భూముల మీద కన్నేసి, కాజేయడానికి వైసీపీ పెద్దలు అధికార దుర్వినియోగం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. తండ్రి ఆశయాలను బతికించుకోవటానికి ఆశోక గజపతి తపన పడుతున్నారన్నారు. ఆయనకు అందరూ అండగా నిలవాలని... ఒక పవిత్ర సంకల్పాన్ని బతికించాలని పిలుపునిచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: