దేశంలో కరోనా మహమ్మారితో పోరాట చేస్తున్నారు ప్రజలు. గత రెండు నెలలుగా లాక్ డౌన్ కారణంగా మనశ్శాంతి కోల్పోయారు.. ఇప్పుడిప్పుడు లాక్ డౌన్ సడలింపు చేయడంతో ఎవరి పనుల్లో వారు నిమగ్నం అవుతున్నారు. ఇలాంటి కష్టకాలంలోనూ కామాంధులు రెచ్చిపోతున్నారు. అనంతపురం జిల్లాలో దారుణం జరిగింది. అమాయకురాలైన ఓ బాలిక జీవితాన్ని గ్రామ వాలంటీర్ నాశనం చేశాడు. ఇంట్లో ఉన్న బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు. తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో ఈ దారుణానికి పాల్పడ్డాడు. సంతోష్ అదే గ్రామానికి చెందిన ఓ బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడినట్లు బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చిన్నమట్లగొంది గ్రామానికి చెందిన కొత్తరూముల గ్రామ వాలంటీర్ సంతోష్ అదే కాలనీకి చెందిన ఓ బాలిక ఇంటికి వెళ్లాడు.
మీ తల్లిదండ్రులు ఎక్కడికి వెళ్లారని బాలికను అడిగాడు. మా అమ్మానాన్నలు పనికి వెళ్లారని బాలిక చెప్పింది. ఒంటరిగా ఉందని తెలియడంతో వాలంటీర్ సంతోష్ ఒక్కసారిగా ఇంట్లోకి చొరబడ్డాడు. బాలికను బలత్కారం చేసేందుకు ప్రయత్నించాడు. దీంతో భయపడిపోయిన బాలిక గట్టిగా అరిచింది. పాప కేకలు విన్న చట్టుపక్కల వారు పరుగున వచ్చారు. ఇది గమనించిన వాలంటీర్ అక్కడి నుంచి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న బాధితురాలి తల్లిదండ్రులు మడకశిర పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.