ఆంధ్రప్రదేశ్ లో టీచర్ల బదిలీలకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు మంత్రి ఆదిమూలపు సురేష్ కీలక ప్రకటన చేసారు. వెబ్ బేస్ కౌన్సిల్ ద్వారా టీచర్ల బదిలీలు చేపడతామని ఎవరూ కూడా బదిలీల కోసం ఎవరి చుట్టూ తిరగావద్దు అని ఆయన స్పష్టం చేసారు. స్కూల్స్ రీ ఓపెన్ చేసే సమయానికి తాము బదిలీలు చేస్తామని మంత్రి స్పష్టం చేసారు.

 

సిఎం ఆదేశాల మేరకు తాము ఈ ప్రక్రియ చేపడతామని ఏ విధమైన అవినీతి లేకుండానే ఈ ప్రక్రియ మొత్తం పూర్తి అవుతుందని అన్నారు. ఏ ఒక్క టీచర్ కూడా కంగారు పడాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. కాగా ఆగస్ట్ 3 నుంచి స్కూల్స్ ని రీ ఓపెన్ చేయనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: