సిఎం వైఎస్ జగన్ ఏడాది పాలనపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. చంద్రబాబు వారసుడిగా లోకేష్ అప్డేట్ కాలేకపోతున్నారని అన్నారు ఆయన. టీడీపీ పూర్తి ఫ్రస్టేషన్ లో ఉందని వ్యాఖ్యానించారు. టీడీపీ నేతలు దిగజారుడు విమర్శలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. 

 

టీడీపీ పతనం దిశగా వెళ్తుందని అన్నారు అంబటి. చంద్రబాబుకి మేం జవాబుదారి కాదని అన్నారు. వేల కోట్ల రూపాయలను గంగలో పోశారని ఆరోపించారు. చంద్రబాబు హయంలో ఉన్న బకాయిలు అన్నీ కూడా తీరుస్తున్నామని ఆయన చెప్పారు. చంద్రబాబు పాలన అంతా దోపిడీ మయం అన్నారు అంబటి రాంబాబు. 15 వేల కోట్ల రూపాయల బకాయిలు తీర్చామని ఆయన చెప్పుకొచ్చారు. చంద్రబాబు ఎన్ని జన్మలు ఎత్తినా సరే అధికారంలోకి రారని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: