దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన అల్లర్లకు సంబంధించి కొత్తకోణం వెల్లడించింది ఢిల్లీ క్రైం బ్రాంచ్. ఢిల్లీ అల్లర్లలో కీలకంగా భావిస్తున్న ఫైసల్ ఫరూక్ అనే వ్యక్తి  తబ్లీగీ జమాతే చీఫ్ మౌలానా మసూద్‌కు అత్యంత సన్నిహితంగా ఉండే అబ్దుల్ అలీంతో టచ్‌లో ఉన్నారని అంటున్నారు ఢిల్లీ పోలీసులు. క్రైం బ్రాంచ్ తన చార్జిషీట్‌లో ఇదే విషయాన్ని స్పష్టంగా చెప్పింది. ఢిల్లీ కోర్టుకు కూడా దాన్ని సమర్పించింది.

 

ఫైసల్ పాత్రపై క్రైం బ్రాంచ్ ఇప్పటికే ఆయన ఫోన్ కాల్ లిస్టును కూడా బయటకు తీసింది. పూర్తిగా అధ్యయనం చేసిందని తెలుస్తుంది. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా, పింజ్రా టోడ్ గ్రూప్, జామియా కో- ఆర్డినేషన్ కమిటీ, మర్కజ్‌... ఈ తరహా సంస్థలతో అతను టచ్ లో ఉన్నాడు అని అధికారులు పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: