కరోనా పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చి ప్రజలకు ఏ విధమైన ముప్పు లేకపోతే త్వరలోనే అంతర్జాతీయ విమానాలను నడుపుతామని కేంద్ర విమానయాన శాఖా మంత్రి హర్దీప్ సింగ్ పూరి వెల్లడించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్టు ఆయన ట్వీట్ చేసారు. ఏ దేశాలకు విమాన సర్వీసులు నడపాలనే దానితో పాటు విదేశీ పర్యాటకులను అనుమతించే విషయాన్ని కూడా తాము పరిశీలిస్తున్నామని అన్నారు.
'వందే భారత్ మిషన్' మూడో దశలో మరిన్ని విమానాలను కూడా చేర్చనున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ విమానాల్లో విదేశాలకు వెళ్లగోరే వారిని ఎలాంటి ఆంక్షలు లేవన్నారు. 'వందే భారత్ మిషన్' కింద మే 6 నుంచి 312 విమానాల్లో 57,000 మంది పౌరులను వివిధ దేశాల నుంచి తీసుకొచ్చినట్టు ఆయన చెప్పుకొచ్చారు.
Normal international civil aviation operations will only start when they can. Right now most of our metro cities are under some form of restrictions due to which people from other cities cannot travel to catch flights &we also have requirement for mandatory quarantine on arrival.
— Hardeep Singh puri (@HardeepSPuri) June 3, 2020