జియో కస్టమర్లకు 4x బెనిఫిట్స్ పేరిట రిలయన్స్ బంపర్ ఆఫర్ ఇచ్చింది. రూ. 249 లేదా అంత కంటే ఎక్కువ మొత్తంతో రీచార్జ్ చేసుకున్న వారికి ఓకే విలువతో ఉండే నాలుగు డిస్కౌంటు కూపన్లు ఇస్తామని ఒక ప్రకటనలో సంస్థ పేర్కొంది. రిలయన్స్ డిజిటల్, ట్రెండ్స్, ట్రెండ్స్‌ఫుట్‌వేర్‌, ఎజియోలలో ఈ కూపన్ల ద్వారా కోనుగోళ్లపై డిస్కౌంట్లు పొందవచ్చని తమ వినియోగదారులకు చెప్పింది. 

 

రీచార్జ్ చేసుకున్న తరువాత కూపన్లన్నీ మైజియో యాప్‌లోని కూపన్స్ సెక్షన్‌లో జమ అవుతాయని పేర్కొంది. షాపింగ్ చేసేటప్పుడు వీటితో డిస్కోంట్లను పొందవచ్చని చెప్పింది. ఇప్పటికే రిచార్జ్ చేసుకున్న వారు కూడా ఈ ఆఫర్‌ని వాడుకునే అవకాశం ఇచ్చింది జియో... దీనిపై వినియోగదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: