కరోనా మహమ్మారి  బాలీవుడ్ ని బెంబేలెత్తిస్తోంది. మొన్నటికి మొన్న బాలీవుడ్ గాయని మని కనికా కపూర్ కి కరోనా వచ్చిన విషయం మనందరికీ తెలుసు. అయితే ఆ తరువాత కొంత కాలం తరువాత కోలుకొని ఇంటికి వెళ్లిపోయారు. ఆ తరువాత ప్రముఖ వెర్సిటైల్ సీనియర్ నటుడు కిరణ్ కుమార్ కి కూడా కరోనా వచ్చినట్లు వార్తలు వచ్చాయి. మల్లి అదే బాలీవుడ్ నుండి నిర్మాత కరీంమొరని కి మరియు అయన ఇద్దరు కుమార్తెలకు కొరోనా సోకింది. ఇటీవలే మ్యూజిక్ కంపోసర్ కి కరోనా సోకడంతో మరణించారు. ఇలా కరోనా ఎవరిని విడిచిపెట్టకుండా అందరి తాట తీస్తోంది.

 

 

ప్రస్తుతం ఆ సెగ సౌత్ ఇండియాలో ప్రముఖ నిర్మాణ సంస్థగా పిలువ బడే రిలైన్స్ బిగ్ ఎంటర్టైన్మెంట్ ప్రయివేట్ లిమిటెడ్ కి తాకింది. ఈ సంస్ద చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్  శిబాశిష్ సర్కార్ కు కరోనా పాజిటివ్ అని తేలటంతో ముంబైలోని హాస్పిటల్ లో చేర్చి చికిత్స అందిస్తున్నారు. దీనితో ఒక్కసారిగా అందరు ఉలిక్కి పడ్డారు. అయితే శిబాశిష్ సర్కార్ పవన్ కళ్యాణ్ నటించిన అత్తారింటికి దారేది చిత్రం కు  సహా నిర్మాతగా ఉన్నారు. ప్రస్తుతం ఈయన 83 అనే సినిమాకు ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. అయితే 83 సినిమా నిర్మాణ పనులను పూర్తి గావించింది. అయితే ఈ లాక్ డౌన్ కారణంగా మూలాన పడడంతో ..లాక్ డౌన్ అనంతరం రిలీజ్ చేయాలనీ అంతా అనుకుంటున్నారు 

మరింత సమాచారం తెలుసుకోండి: