తెలంగాణలోని నల్గొండలో ఓ వ్యక్తి రివాల్వర్తో హల్చల్ చేశాడు. అయితే.. హరిబాబు అనే వ్యక్తిని గాయం ఉపేందర్రెడ్డి బెదిరించినట్లు భావిస్తున్నారు. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఏం జరుగుతుందో తెలియక ఉక్కిరిబిక్కిరయ్యారు.
ఈ ఘటనపై స్పందించిన రూరల్ పోలీసులు వెంటనే రంగంలోకి దిగి కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల సమగ్ర విచారణ తర్వాతే ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశాలు ఉన్నాయి.