తొలిసారి ఆస్ట్రేలియా ప్రధాని మోరిసన్ తో భారత ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ మీటింగ్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ  మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేసారు. భారతదేశం & ఆస్ట్రేలియా సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి ఇది సరైన సమయని ఆయన అభిప్రాయపడ్డారు. మన స్నేహాన్ని బలోపేతం చేయడానికి అంతులేని అవకాశాలు ఉన్నాయన్నారు. 

 

ఈ సామర్థ్యాన్ని వాస్తవికతగా మార్చడానికి ఇది సవాళ్లను తీసుకొస్తుందని... మన మధ్య సంబంధాలు భారత్ కి చాలా కీలకంగా మారతాయని మోడీ అన్నారు. రక్షణ రంగంలో ఆస్ట్రేలియా చాలా ముందుకి వెళ్తుంది అని మోడీ వ్యాఖ్యానించారు. త్వరలోనే భారత పర్యటనకు రావాలి అని ఆయన ఆసిస్ ప్రధానిని ఆహ్వానించారు. దీనికి ఆయన కూడా సానుకూలంగా స్పందించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: