ప్రముఖ తమిళ సినీనటుడు, నటి స్నేహ భర్త ప్రసన్నకు విద్యుత్‌ బోర్డు షాక్‌ ఇచ్చింది. వలం ఒక్క నెలకే ఇంటి కరెంట్ బిల్లు రూ. 70 వేలు చెల్లించాలని సూచించారు. దీనికి నోటీసులు కూడా అందించారు. ఆ బిల్లు చూసిన ప్రసన్న ఒక్కసారిగా షాక్ అయ్యాడు. అంత బిల్లు ఎలా వచ్చిందని ఆశ్చర్యపోయాడు. దీంతో అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై ప్రసన్న మాట్లాడుతూ తమ ఇళ్ళకు వచ్చిన విద్యుత్‌ బిల్లును చూసి ఆశ్చర్యపోయానని, 70 వేల వరకు విద్యుత్‌ ఛార్జీలు చెల్లించడానికి తనకు ఆర్థిక స్థోమత ఉందని, ఇలాంటి విద్యుత్‌ బిల్లు మధ్యతరగతి కుటుంబీకులకో, పేదలకో వెళ్లి ఉంటే వారి పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు.

 

గతంలో తమకు రెండు నెలలకు కూడా ఇంత బిల్లు రాలేదని ఇప్పుడు ఇలా రావడం ఏంటని నిలదీశారు. ఈ బిల్లు చెల్లించడం తనకు పెద్ద కష్టం కాదని.. కానీ పేదవారికి కూడా ఇలా తప్పుల తడకలా బిల్లు పంపితే వాళ్ల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. దీంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. లాక్‌డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో మీటరు రీడింగులో తప్పులు దొర్లాయాని గుర్తించారు. వెంటనే వాటిని సరి చేసి కొత్త బిల్లు పంపిస్తామని అన్నారు. ఈ వ్యవహారంతో తమిళనాడు విద్యుత్ అధికారుల తీరుపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: