ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి కొద్దిసేపటి క్రితం వైయస్సార్ వాహనమిత్ర పథకాన్ని ప్రారంభించారు. నాలులు నెలల తర్వాత ఈ పథకాన్ని అమలు చేయాల్సి ఉన్నా ఆటో, క్యాబ్ డ్రైవర్లు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని సీం జగన్ ఈ పథకాన్ని ముందుగానే అమలు చేశారు. ఈ పథకంలో భాగంగా ఆటో, ట్యాక్సీ ఉన్న వారికి రెండో విడతగా రూ.10,000 ఆర్ధిక సాయం అందించనున్నారు.  

 

2,62,493 మంది లబ్దిదారులకు నేరుగా రూ.10,000 చొప్పున ఖాతాలలో ఆన్ లైన్ ద్వారా నగదు జమ చేయనున్నారు. ఆటో, ట్యాక్సీ కార్మికులను ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సీఎం జగన్‌ మాట్లాడుతున్నారు. తొలి విడతతో పోలిస్తే దాదాపు 40,000 మంది కొత్తగా ఈ పథకంలో చేరారని తెలుస్తోంది. సీఎం జగన్ డ్రైవర్లకు మద్యం తాగి వాహనాలు నడపవద్దని విజ్ఞప్తి చేశారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: