సొంతంగా ఆటో ట్యాక్సీ, క్యాబ్ లను నడుపుకునే వారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వరుసగా రెండో ఏడాది కూడా 10 వేల రూపాయల నగదు బదిలి చేసింది. మొదటి ఏడాది దాదాపు రెండు లక్షల మందికి లబ్ది చేకూరింది. ఈ ఏడాది అదనంగా 37 వేల మందికి పైగా లబ్ది పొందారు. ఇక ఈ సందర్భంగా సిఎం వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేసారు. ఆటో డ్రైవర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 

 

కరోనా ఉన్నా సరే తాము ముందుగానే ఆర్ధిక సహాయం చేస్తున్నామని అన్నారు. గతంలో జరిమానాలతో డ్రైవర్లు చాలా ఇబ్బందులు పడే వారు అని జగన్ అన్నారు. ఇప్పుడు ఏ ఇబ్బందులు లేకుండా చూసుకునే ప్రయత్నం చేస్తున్నామని అన్నారు జగన్.

మరింత సమాచారం తెలుసుకోండి: